Friday, 9 October 2020

సుమతి పద్యం - 78 (paalanu galasina jalamunu)

పాలను గలసి జలమును
బాలవిధంబుననే యుండు బరికింపంగా
బాల చవి జెరచుగావున
బాలసుడగువాని పొందు వలదుర సుమతీ
!  - బద్దెన

భావం:- ఓ బుద్ధిమంతుడా! పాలను నీటిని కలిపినప్పుడు, ఆ మిశ్రమం కూడా పాలలా కనిపిస్తుంది, కానీ అది పాల రుచిని పాడు చేస్తుంది.అదే విధంగా దుష్ట వ్యక్తితో  స్నేహం నీ మంచితనాన్ని పాడు చేస్తుంది. అందువల్ల దుష్టులకి సాధ్యమైనంత దూరంగా ఉండండి.

No comments:

Post a Comment